కశ్మీర్ అనగానే మంచు కొండలు, అందమైన ప్రకృతి పర్యాటక ప్రదేశాలు గుర్తొస్తాయి. వీటితో పాటు అక్కడి అందమైన మహిళలు కూడా గుర్తొస్తారు. ఇంతకీ కశ్మీర్ మహిళలు ఎందుకు అందంగా ఉంటారు.? వీరి అందం వెనకాల సీక్రెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కశ్మీరీ మహిళలు తమ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుకోవడానికి అనేక పురాతన పద్ధతులను కూడా ఉపయోగిస్తారు. మీరు కూడా మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవాలనుకుంటే, కాశ్మీరీ బ్యూటీ సీక్రెట్లను ప్రయత్నించండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా, నేచురల్ విధానాల ద్వారా చర్మాన్ని అందంగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
కశ్మీరీ ప్రజలు కుంకుమపువ్వును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది చర్మానికి సహజమైన గులాబీ రంగును ఇవ్వడమే కాదు. కానీ ఇది ఫ్రీ రాడికల్స్ నుండి కూడా రక్షిస్తుంది. కుంకుమపువ్వులో ఉండే యాంటీఆక్సిడెంట్ అంశాలు చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. దీన్ని పాలలో కలిపి దూది సహాయంతో ముఖానికి రాసుకుంటే కొన్ని రోజుల్లోనే ముఖం మెరుస్తుంది.
బాదంలో ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, రాగి మరియు భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను లోపలి నుంచి రిపేర్ చేయడంలో సహాయపడతాయి. ఇందులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంపప్పులను మెత్తగా చేసి, తేనె, పాలతో కలిపి చర్మానికి అప్లై చేసుకోవాలి.
ఇక కశ్మీర్లో లభించే వెల్లుల్లిలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని B1, B6, C చర్మంపై మొటిమలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. ఇది అదనపు నూనెను గ్రహిస్తుంది. చర్మంపై మొటిమలను నివారిస్తుంది. వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయి. దీని కోసం, వాల్నట్ పొడిని తేనె, రోజ్ వాటర్తో కలిపి పేస్ట్ లా చేయాలి. ఇప్పుడు దీనిని ఫేస్ స్క్రబ్ లా ఉపయోగించి డెడ్ స్కిన్ ని తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.