ఏపీ సీఎం చంద్రబాబు మాటల్లో సెల్ఫ్గోల్ తప్ప మరేమీ లేదన్నారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి. చంద్రబాబు ప్రెస్మీట్పై తీవ్రంగా స్పందించిన ఆయన కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. విజయసాయి రెడ్డిపై చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ సమాధానమిచ్చారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఓటుకు కోట్ల కేసు నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు అమరావతి పారిపోయాడన్నారు. ఏపీలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.