25మందితో రేపే వైసీపీ తొలి జాబితా..

Update: 2019-03-12 15:27 GMT

వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా సిద్ధమైంది. కొన్ని స్థానాలు మినహా మెజారిటీ నియోజకవర్గాలకు అభ్యర్ధులు ఖరారయ్యారు. నోటిఫికేషన్‌‌కు ఇంకా ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రేపట్నుంచి విడతల వారీగా అభ్యర్ధులను ప్రకటించాలని వైసీపీ అధినేత జగన్మోహన్‌‌రెడ్డి నిర్ణయించారు. రోజుకి 25మంది చొప్పున మొదటి మూడ్రోజులు 75మంది అభ్యర్ధులను ప్రకటించనున్నారు. ఉత్తరాంధ్రలో దాదాపు అన్ని స్థానాలకు దాదాపు అభ్యర్ధులు ఖరారు కాగా ఆరేడు నియోజకవర్గాల్లో మాత్రమే ఇద్దరిద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక అత్యంత కీలకమైన ఉభయగోదావరి జిల్లాల్లో అభ్యర్ధుల ఎంపికపై భారీ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరిలో అభ్యర్ధులు ఖరారైనా అత్యంత కీలకమై తూర్పుగోదావరిలో మాత్రం అత్యధిక స్థానాలు ఇంకా పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జల్లాల్లో అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. ఇక వైసీపీకి అత్యంత కీలకమైన రాయలసీమ జాబితా కూడా ఫైనలైంది.

Similar News