పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఇష్టమొచ్చినట్లు పెంచినట్లు వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మాణం మాత్రం పునాది గోడలు దాటి ముందుకు సాగడం లేదన్నారు . తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన జగన్ పక్కనే గోదావరి ఉన్నా సాగు, తాగునీటికోసం జనం అల్లాడుతున్న పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేదన్న ఆయన చంద్రబాబు ఉన్నది లేన్నట్లు లేనిది ఉన్నట్లు చూపిస్తున్నారని విమర్శించారు.ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా మేనిఫెస్టో రూపొందించినట్లు చెప్పిన జగన్ వైసీపీ అధికారంలోకి వస్తే సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు.