జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లా పింగ్లన్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే అక్కడే మోహరించిన కొందరు యువకులు టెర్రరిస్టులకు అనుకూలంగా ప్రవర్తించారు. భారత్ వ్యతిరేక నినాదాలు చేసిన అల్లరి మూకలు జవాన్లపైకి రాళ్ళు విసిరారు. సయమనం పాటించాలని ఆర్మీ అధికారులు కోరినా ఫలితం దక్కలేదు. ఎన్ కౌంటర్ జరిగినంతసేపు రాళ్ళు విసురుతూనే ఉన్నారు.