సిద్ధిపేట జిల్లాలో వడదెబ్బతో ఓ మహిళ మృత్యువాత పడింది. దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామానికి చెందిన కొమ్ము ప్రమీలో రోజు మాదిరిగానే వ్యవసాయ పనులు చేస్తుండగా ఎండతీవ్రతకు లోనైంది. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో ప్రాణం కోల్పో.యింది. కూలి చేసుకుని జీవనం సాగిస్తున్న మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.