ఓటరును ఆశ్చర్యపరిచిన వైసీపీ ఎంపీ అభ్యర్థి పీవీపీ

Update: 2019-04-18 02:46 GMT

ఎన్నికల ముగిశాక ప్రజలను మరిచిపోతుంటారు నేతలు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ మాత్రం నేను ఎప్పటికి మీ వెంటే ఉంటానని నిరూపించారు. ఎన్నికల సమయంలోనే నాయకులు వస్తారు ఎన్నికలు అయిపోయాక ఎందుకు వస్తారులే అని విజయవాడ వాంబే కాలనీకి చెందిన జమ్రుదా బేగం ఎన్నికల ప్రచారంలో పీవీపీతో అంది. ఎన్నికలు ముగిశాక కూడా మీ ఇళ్లకు వస్తానని అప్పుడు మాట ఇచ్చారు పీవీపీ. ఇచ్చిన మాట ప్రకారం జమ్రుదా బేగం ఇంటికి పీవీపీ దంపతులు వచ్చి భోజనం చేశారు. దీంతో జమ్రుదా బేగం కుటుంబ సభ్యులు తెగ సంబరపడిపోయారు.

Full View   

Similar News