కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యధేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా ప్రజావేదిక ద్వారా టెలీ కాన్ఫరెన్సులు, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో లేదో తమకు తెలియదని, ఈ విషయంపై సీఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు.