ట్రాఫిక్ పోలీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ రోజు ప్రజలను ఛలాన్ల పేరుతో పీడిస్తున్నారని ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ ముందు వాహనాలకు ఛలాన్లు రాస్తున్న ట్రాఫిక్ పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఎండలకు బయటకు రావడానికే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వాహనదారులను ఎండలో ఆపి ఛలాన్లు రాయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఆపిన 20 వాహనాలను వీహెచ్ విడిపించి అక్కడి నుంచి పంపించేశారు.