ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన వేళ విజయవాడ నుంచి ఆ పార్టీ టికెట్పై బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేసీఆర్ వీరాభిమాని కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీఆర్ఎస్ టికెట్పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన, అభివృద్ధి కార్యక్రమాలే తమకు మార్గదర్శకాలని, అవే ఏపీలో టీఆర్ఎస్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. విజయవాడ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీచేసేందుకు సీఎం కేసీఆర్ను భీ ఫారం కోరుతానని, విజయం సాధించి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బహుమతిగా ఇస్తానని పేర్కొన్నారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ తెలంగాణలో 16 ఎంపీ స్థానాలను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పబోతున్నదని చెప్పారు.