ఏపీలో గెలిచేది వైసీపీనే : కేటీఆర్

Update: 2019-02-23 10:33 GMT

ఏపీలో చంద్రబాబు వందశాతం ఓడిపోతారని జోస్యం చెప్పారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వైసీపీ గెలవడం ఖాయమని చెప్పారు. ఇక నుంచి చంద్రబాబు ఢిల్లీలోనే కాదు అమరావతిలో కూడా చక్రం తిప్పలేరని విమర్శించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ చెబుతున్నట్టుగా రాహుల్, వర్సెస్ మోడీ అనేలా ఎన్నిక ఉండదన్నారు. ఢిల్లీని శాసించాలంటే రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5సీట్లూ కచ్చితంగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Similar News