టీడీపీకి మరో షాక్ తగలబోతోంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు వైసీపీలో చేరబోతున్నట్టు ఒంగోలులో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జగన్ను కలిసినట్టు మాగుంట అనుచరుల నుంచి సమాచారం అందుతోంది. సొంత సర్వేలో ఓడిపోతానని తేలడంతో మాగుంట శ్రీనివాసులు వైసీపీ వైపు చూస్తున్నట్టు అనుచరులు చెబుతున్నారు. నిన్న అనుచరులతో నెల్లూరులో రహస్య భేటీ నిర్వహించిన మాగుంట శ్రీనివాసులు వైసీపీలో చేరే అంశంపై చర్చించినట్టు తెలుస్తోంది.