కొనసాగుతున్న పంచాయతి ఎన్నికల కౌంటింగ్‌

Update: 2019-01-25 08:45 GMT

తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభమైంది. 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా నిజామాబాద్‌ జిల్లా జెల్లాపల్లిలో బ్యాలెట్‌ పేపర్‌లో అభ్యర్థి గుర్తు తప్పుగా రావడంతో వాయిదా పడింది. దీంతో ఎన్నికలు జరిగిన 3,341 పంచాయతీల్లో కౌంటింగ్‌ మొదలైంది.

రెండో విడతలో మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల కోసం నోటిఫికేషన్లు వెలువడగా, వాటిలో 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఏడు సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా 3,341 సర్పంచ్‌ స్థానాలకు ఈరోజు పోలింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 

Similar News