సికింద్రాబాద్ బోయిన్పల్లిలో భారీగా వెండి స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. కంటైనర్ను చెక్ చేసిన పోలీసులు అందులో భారీ మొత్తంలో తరలిస్తున్న వెండిని గుర్తించారు. వెంటనే కంటైనర్ను సీజ్ చేసిన సీఐ రాజేశ్ బృందం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్కు వెండి కంటైనర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. బోయిన్పల్లి వద్ద 10టన్నుల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెండి విలువ సుమారు 40 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.