విజయవాడలో రాంగోపాల్ వర్మ ప్రెస్‌మీట్...

Update: 2019-05-26 01:53 GMT

 లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు.... డైరెక్టర్ రాంగోపాల్ వర్మ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ సినిమా రిలీజ్‌కి సంబంధించి విజయవాడలో రోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించడం, దానికి అనుమతి లేదంటూ పోలీసులు గన్నవరం ఎయిర్ పోర్టులోనే ఆయన్ని అడ్డుకోవడం, అరెస్టు చెయ్యడం, తిరిగి హైదరాబాద్ పంపించెయ్యడం... ఇలా చాలా ఎపిసోడ్ నడిచింది కదా.

అప్పటి నుంచీ టీడీపీపై భగ్గుమంటున్న వర్మ... సరైన టైం కోసం ఎదురుచూశాడు. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీడీపీ ఘోర ఓటమికి తోడు... వైసీపీ దేశంలోనే నాలుగో బలమైన పార్టీగా అవతరించింది. ఫలితంగా వర్మకు రెడ్ కార్పెట్ పరిచినట్లైంది. ఆ జోష్‌లో ఉన్న వర్మ... ఏ విజయవాడ నుంచీ తనను వెళ్లగొట్టారో అదే బెజవాడలో గాంధీనగర్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. 

Similar News