కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్పై ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మోడీకి రాహుల్ సవాల్ విసిరారు. రాఫెల్ గురించి ఎందుకు తనతో చర్చకు రాలేదో మీడియాకు వివరించాలని రాహుల్ డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలనే తమ ప్రధాన అస్త్రాలుగా తీసుకున్నామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ధన బలాన్ని నమ్ముకుంటే కాంగ్రెస్ సత్యాన్నినమ్ముకుందని రాహుల్ అన్నారు. సత్యమే చివరికి గెలుస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.