జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, సినీనటుడు నాగబాబు కాసేపట్లో జనసేనలో చేరనున్నారు. జనసేన లోక్ సభ అభ్యర్థిగా నర్సాపురం నుంచి పోటీ చేయనున్నారు. దీనిపై జనసేన అధికారికంగా ప్రకటించింది. ఎన్నికలు సమీపించే కొద్ది జససేన పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరడంతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ భీమవరం, గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో తమ పార్టీకి బాగా పట్టున్న పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి నాగబాబును బరిలోకి దింపాలని భావిస్తున్నారు.
కొద్దిసేపటిలో జనసేన పార్టీలో చేరనున్న ప్రముఖ నటులు, జనసేనాని శ్రీ పవన్ కల్యాణ్ గారి అన్నయ్య శ్రీ నాగబాబు గారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారు.
— JanaSena Party (@JanaSenaParty) March 20, 2019