వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేసును NIAకు కేసు విచారణ అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. కోర్టు సెలవులు పూర్తి కాగానే ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయనుంది. కోర్టులో ఈ విషయం తేలే వరకు ఈ కేసు విచారణ ఫైళ్లను NIAకు ఇవ్వకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.