దేశంలో బీజేపీ విజయం వెనుక అమిత్షా వ్యూహమే కీలకంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. మొదటగా తాను బీజేపీ కార్యకర్తను అని, ఆ తర్వాతే దేశానికి ప్రధానమంత్రి అని చెప్పారు ప్రధాని మోడీ. ఇవాళ వారణాసిలో పర్యటించిన మోడీ కాశీ విశ్వనాథుడికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తన గెలుపుకోసం కష్టపడిన కాశీలోని బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రిలాక్స్ అయ్యే సందర్భం చాలా అరుదుగా వస్తుందని, ప్రచారం, ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకే కేదార్నాథ్ వెళ్లినట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలు చెప్పినట్లు విన్నానన్న మోడీ వారిని సంతోషపెట్టడమే తన మంత్రమన్నారు. కాశీ శక్తిని, శాంతిని ఇస్తుందన్న మోడీ తప్పుడు అభిప్రాయాలను క్రియేట్ చేసేందుకు కొందరు ప్రయత్నించారని, కానీ అవన్నీ అబద్దమని రుజువయ్యాయన్నారు. వారణాసి ప్రజలపై నాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. వారణాసిలో గెలుపు తనలో అసాధారణ విశ్వాసాన్ని నింపిందన్నారు మోడీ.