పొలింగ్ తీరుపై నిజామాబాద్ ఎంపీ కవిత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపీ కవిత స్వగ్రామం పోతంగల్లో ఈవీఎంలు సరిగా పనిచేయక మొరాయించాయి. కవిత తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సుమారు 40 నిమిషాలపాటు క్యూలో నిల్చున్నారు. పోలింగ్ సిబ్బంది పనితీరుపై కవిత అసహనం వ్యక్తం చేశారు.