తెలంగాణ బీజేపీలోకి భారీగా వలసలు

Update: 2019-06-20 05:21 GMT

ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడిచినా తెలంగాణలో వేడి తగ్గలేదు. భానుడి భగభగలను మించి రాజకీయ వేడి రగులుతోంది. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన సీనియర్ నేతలు రోజుకొకరు పార్టీలు మారుతూ రాజకీయ ప్రకంపనలు స్పష్టిస్తున్నారు. తాజాగా టీడీపీ చెందిన సీనియర్ నేతలు కమలం గూటికి చేరేందుకు క్యూ కట్టారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు చాడ సురేష్ రెడ్డి, బోడ జనార్ధన్‌ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖారరైంది. ఈ నెల 27న పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో పార్టీ చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలతో తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టే భావిస్తున్నారు.  

Tags:    

Similar News