జెండా ఎగరేసే విషయంలో ఇద్దరు టీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం

Update: 2019-01-27 06:58 GMT

రిపబ్లిక్ డే రోజు జాతీయ భావాన్ని, దేశభక్తిని ప్రజల్లో పెంపొందించాల్సిన నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు జెండా నేను ఎగరేస్తానంటే నేను ఎగరేస్తానంటూ గొడవపడ్డారు. జెండా పట్టుకుని ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ నేతల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

మంచిర్యాల జిల్లా అరుణక్క నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల _3 ఎంపీటీసీ రవీందర్ తన ప్రాంతంలో కాకుండా మంచిర్యాల -2 ఎంపీటీసీ ప్రాంతంలో జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు. దీంతో మంచిర్యాల -2 ఎంపీటీసీ తిరుపతి రవీందర్‌ను అడ్డుకున్నారు. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఆ ఇద్దరు నేతల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Full View 

Similar News