కోట్ల కుటుంబంతో కలిసి పని చేసేందుకు సిద్ధం: కేఈ సోదరులు

Update: 2019-02-07 05:38 GMT

కోట్ల కుటుంబం టీడీపీలో చేరినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేఈ సోదరులు ప్రకటించారు. కర్నూలు మాజీ ఎంపీ కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరనున్న నేపధ్యంలో సీఎం చంద్రబాబు కేఈ సోదరులతో చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. చంద్రబాబు సూచనపై సానుకూలంగా స్పందించిన కేఈ సోదరులతో కోట్లతో పనిచేసేందుకు తాము సిద్ధమన్నారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్ధానాలతో పాటు తమ వర్గం వారి నియోజకవర్గాలు కోట్లకు కేటాయించవద్దని చంద్రబాబును కోరినట్టు సమాచారం.  

Similar News