నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలంటూ అసమ్మతి వర్గం రోడ్డెక్కింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్దన్రెడ్డి, వంటేరు వేణుగోపాల్రెడ్డి అసమ్మతి యాత్రను మొదలుపెట్టారు. అల్లూరు నుంచి కె.బిట్రగుంట వరకూ పాదయాత్ర జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు , అభిమానులు హాజరయ్యారు. అయితే, కావలిలో కొంతకాలంగా విభేదాలు కొనసాగడంపై రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు విష్ణువర్దన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డిలతో జగన్ సమక్షంలో చర్చలు జరిపారు. అవి ఫలించకపోవడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇవాళ పాదయాత్ర చేపట్టారు.