జెట్ ఎయిర్వేస్ సంక్షోభానికి ఇంకా తెర పడలేదు. నిధుల లేమితో తీవ్ర నష్టాల ఊబిలో ఉన్న జెట్ ఎయిర్వేస్ జెట్ ఎయిర్వేస్ కార్యకాలాపాలు మూత పడనున్నాయని తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన విమానాలు అన్నీ తాత్కాలికంగా రద్దు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబైలో జెట్ సంస్థ బోర్డ్ మీటింగ్ జరిగింది. కానీ బోర్డు సమావేశంలో ఎలాంటి పరిష్కారం లభించలేదు. జెట్ను ఆదుకునే ప్రయత్నాలు విమానయానశాఖ చేసినా ఫలితం లేకుండాపోయింది. ఆ సంస్థకు ఎమరెన్సీ నిధులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే జెట్ఎయిర్వేస్ను మూసివేతకు బోర్డు ప్రతిపాదించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జెట్ సంస్థ సుమారు 8 వేల కోట్ల అప్పుల ఉబిలోఉంది. ప్రస్తుతం ఆ కంపెనీకి చెందిన పది విమానాలు మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఇక నుండి ఆ విమానాలు కూడా ఎగరవని తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్.. గత నెలలో సంస్థకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.