మరో ఇంటర్‌ విద్యార్థిని బలవన్మరణం

Update: 2019-04-24 05:17 GMT

ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం రంగారెడ్డి జిల్లాలో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు దారితీసింది. ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో ఇంటర్ విద్యార్ధిని జ్యోతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. షాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన జ్యోతి చేవెళ్లలోని వివేకానంద కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండీయర్ పరీక్షలు రాసింది. సివిక్స్ సబ్జెక్టు లో ఫెయిల్ అవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Similar News