పుల్వామా ఉగ్ర దాడితో తమకు సంబంధం లేదని, భారత్ ఎలాంటి ఆధారాలు చూపలేదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ హైకమిషనర్కు సమన్లు ఇచ్చిన భారత విదేశాంగశాఖ పుల్వామా అటాక్లో జైషే ఉగ్ర సంస్థ ప్రమేయం ఉందంటూ ఆధారాలు అందజేసింది. అలాగే తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. దాంతో ఇన్నిరోజులూ భారత్ ఆధారాలు ఇవ్వలేదంటూ సాకులు చెప్పిన పాకిస్తాన్ ఏం చేస్తుందో చూడాలి.