ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గంలో తాను గెలవకుంటే ఈవీఎంలను బీజేపీ ట్యాంపర్ చేసినట్టేనని సమాజ్ వాదీ నేత ఆజంఖాన్ వ్యాఖ్యానించారు. తనకు మూడు లక్షల ఓట్లకు పైగా మెజారిటీ ఖాయమని, అంత మెజారిటీ రాకుపోతే ఈవీఎంలలో లోపాలున్నట్టేనని భావించాల్సి వుంటుందని ఆయన అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా తనకే మద్దతుగా నిలిచారని, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ తాన ఓడిపోతే దానికి కారణం ఈవీఎంల టాంపరింగేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫలితాలకు ఆయన ఒక్కరోజు ముందు ఈవ్యాఖ్యల చేశారు. కాగా ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అజంఖాన్ ఇప్పటికే ఈసీ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. రాంపూర్లో బీజేపీ నుంచి పోటీచేస్తున్న జయప్రదపై పలుమార్లు నోరుజారి వివాదాస్పదంగా నిలిచారు.