కిడారి శ్రవణ్ కుమార్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండానే మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలు కావడంతో రాజీనామా చేయాలన్న రాజ్భవన్ ఆదేశాలతో కిడారి శ్రవణ్ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం మంత్రిగా నియమితులైన వారు ఆరు నెలల్లోగా చట్ట సభకు ఎన్నిక కావాలి. కానీ శ్రావణ్కు ఆరునెలల వ్యవధి ఈ నెల 10తో ముగియనుంది. దీంతో కిడారి శ్రవణ్ రాజీనామా చేశారు.