బ్రేకింగ్‌: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా బదిలీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ. సిసోడియాను ట్రాన్స్‌ఫర్ చేసింది.

Update: 2019-01-17 12:13 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ. సిసోడియాను ట్రాన్స్‌ఫర్ చేసింది. సిసోడియా స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియామిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. గోపాలకృష్ణ ద్వినేది పేరును ఏపీ ప్రభుత్వం నామినేట్ చేయగా ఆ ప్రతిపాదన మేరకు ఆయన్నే ఏపీ ఎన్నికల అధికారిగా నియమించింది. తన నిమయకంపై నివేది స్పందిస్తూ ఏపీలో అన్ని శాఖలు సహకరిస్తే ఎన్నికల ప్రక్రియ విజయవంతమవుతుందన్నారు. రానున్న ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో మంతనాలు జరుపుతామని చెప్పారు. ఎన్నికల్లో తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని అలాగే ఓటర్లలోనూ చైతన్యం రావల్సిన అవసరం ఉందని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. 

Similar News