టీడీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి. వైసీపీకి రాజీనామా చేసిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఏపీఎన్జీవో నేత అశోక్బాబు ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన మరో నేత వంగవీటి రాధాకృష్ణ కూడా రేపు టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ మీడియా సమావేశం పెట్టి బహిరంగ ప్రకటన చేయనున్నారు.