ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఒకే విద్యార్థికి రెండు హాల్టికెట్లు జారీ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన వినోద్ 2015-17 సంవత్సరంలో మెట్పల్లిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివాడు. కెమిస్ట్రీ ఫెయిల్ కావడంతో సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ఫీజు చెల్లించాడు. ఈ నెల 12న పరీక్ష రాయాల్సి ఉండటంతో హల్టికెట్ డౌన్చేసుకుని షాక్కు గురయ్యాడు. ఇంటర్ బోర్డు రెండు హాల్ టికెట్లు జారీ చేయడమేకాక నంబర్లు, పరీక్ష కేంద్రాలు వేర్వేరుగా కేటాయించడంతో అవాక్కయాడు. ఏ కేంద్రంలో పరీక్ష రాయాలో తెలియక వినోద్ అయోమయానికి గురవుతున్నాడు.