పోలింగ్ ముహూర్తం చేరువయ్యేకొద్దీ దేశంలో ఎన్నికల ప్రచార సంరంభం హోరెత్తుతోంది. ఇదిలా ఉంటే సమాజ్ వాద్ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆజంగఢ్ లోక్సభ స్థానం నుండి ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే కాగా అఖిలేశ్కి ధీటుగా బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా తమ పార్టీ తరుపున భోజ్పురి నటుడు, గాయకుడు దినేశ్ లాల్ యాదవ్ ను పోటీలోకి దింపింది. దినేశ్ లాల్ తోపాటు ప్రముఖ నటుడు రవికిషన్ కూడా ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలసిందే. పూర్వాంచల్ ప్రాంతంలో దినేశ్, రవికిషన్ కు అభిమానులు ఎక్కువ. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం దినేశ్ను అఖిలేశ్ పై పోటీకి పెట్టింది. మరీ ప్రజలు చివరికి ఎవరికి పట్టం కట్టి జేజేలు కొడుతారో వేచిచూడాల్సిందే.