కొమురం భీం జిల్లాలో ఓ ఇంట్లో దెయ్యం వణికిస్తోంది. కాగజ్నగర్లోని సిల్క్ కాలనీలో పార్క్ లైన్లోని ఓ ఇంట్లో దెయ్యం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇంట్లో సామాన్లు పడేస్తుందని అందులో నివాసముండే వృద్ధ దంపతులు భయంతో ఇల్లు విడిచి బంధువుల ఇంటికి పారిపోయారు. దెయ్యం భయంతో గ్రామస్తులంతా హడలిపోతుండటంతో పోలీసులు కాలనీలో విచారణ ప్రారంభించారు.