సినీ నటుడు, వైసీపీ నేత మోహన్బాబుకు హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు ఎడాది జైలు శిక్ష విధించింది. చెక్బౌన్స్ కేసులో ఏ-1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ-2గా మోహన్బాబును దోషులుగా తేల్చిన కోర్టు లక్షా 25 వేలు జరిమానా విధించింది. మూడు నెలల్లోగా బాకీ చెల్లించాలని ఎర్రమంజిల్ కోర్టు ఆదేశించింది.
2010లో 40 లక్షల 50 వేలకు మోహన్ బాబు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఎర్రమంజిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏ-1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ-2గా మోహన్బాబును కోర్టు దోషులుగా తేల్చింది. బాకీ మొత్తాన్ని మూడు నెలల్లోగా వైవీఎస్ చౌదరికి చెల్లించాలని తీర్పునిచ్చింది.