వంటేరుకు కేసీఆర్‌ లిఫ్ట్‌

Update: 2019-01-18 04:49 GMT
Vanteru

టీ పీసీసీ అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ తరఫున గజ్వేల్‌ బరిలో నిల్చిన వంటేరు ప్రతాప్‌రెడ్డి ఇవాళ కారెక్కనున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ప్రగతీభవన్‌లో కేసీఆర్‌ ను వంటేరు కలవనున్నారు. గులాబీ కండువా కప్పి వంటేరును పార్టీలోకి ఆహ్వానించనున్నారు. గతంలో గజ్వెల్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యర్థిగా రెండు సార్లు పోటీ పడ్డారు. అయితే ఆ రెండుసార్లు కేసీఆర్‌ చేతిలో వంటేరు ప్రతాప్‌రెడ్డి ఓడిపోయారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి హామీతో పాటు గజ్వెల్‌ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలు కూడా ఆయనకే ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయన కుమారుడికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. 

Similar News