ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కూడా రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఆందోళ్లో ఈ సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 5 గంటలా 30 నిమిషాలకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సాపూర్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంచార్జీ మంత్రులు, ఇతర నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.