దొంగ సర్వేలు జగన్‌కు అలవాటే: చంద్రబాబు

Update: 2019-01-25 05:23 GMT

ప్రధాని మోడీతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మాటల దాడి చేశారు. జిల్లా అధ్యక్షులు, నియోజక ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఇరు పార్టీల తీరును తీవ్ర స్ధాయిలో ఎండగట్టారు. అభివృద్ధి ఆగిపోవాలనే దురుద్దేశంతోనే వైసీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారంటూ చంద్రబాబు విమర్శించారు. ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు చేయించడం జగన్‌కు అలవాటేనంటూ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పాటు మోడీకి మద్ధతిచ్చే నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆ‍యన అన్నారు.

 Full View

Similar News