ఆ ముగ్గురికి బాబు సవాల్

Update: 2019-02-24 09:24 GMT

ప్రధాని మోడీవి మాటలేనని, చేతలు కావని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అధికారంలోకి రాగానే అవినీతిని రూపుమాపుతానన్న మోడీ దేశంలోని అవినీతిపరులను కాపాడుతున్నారని ఆరోపించారు. మోడీ, జగన్, కేసీఆర్ కలిసి ఏపీపై కుట్రలు చేస్తున్నారని, ఏపీలో జగన్ ఆటలు సాగవని హెచ్చరించారు చంద్రబాబు. ఏపీకి న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని చెప్పారు. బాక్సైట్ ప్రైవేటుపరం చేసింది వైఎస్సేనని, ఆ సమయంలో వాటిని ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంది కిశోర్‌చంద్రదేవ్‌ అని తెలిపారు. 

Similar News