ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదాం: చంద్రబాబు

హైకోర్టు విభజన పూర్తయిందని భావిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌‌తో కలిసి ప్రారంభించారు.

Update: 2019-01-01 13:43 GMT

హైకోర్టు విభజన పూర్తయిందని భావిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌‌తో కలిసి ప్రారంభించారు. చరిత్ర తిరగ రాయడానికి మనందరం ఉన్నాం. సంక్షోభాన్ని అవకాశాలుగా మలచుకుని ముందుకెళ్తున్నామని ఇక్కడి నుంచి న్యాయపరిపాలనకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. మనందరం కలిసి ఉత్తమ హైకోర్టుగా తీర్చిదిద్దుదామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.  

Similar News