మోడీ అన్ని రంగాల్లోనూ విఫలం: చంద్రబాబు

మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఏపీసీఎం చద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా జన్మభూమి, మన ఊరు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

Update: 2019-01-05 14:25 GMT

మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారని ఏపీసీఎం చద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా జన్మభూమి, మన ఊరు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఆయన జీఎస్టీని సమర్ధవంతంగా అమలు చేయలేకపోయారని తెలిపారు. మోడీ అన్ని రంగాలలోనూ విఫలమయ్యారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం విభేదాలు సృష్టిస్తోందని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్దారు. పోలవరంకు అవార్డులు ఇచ్చిన కేంద్రమే ఆరోపనలు చేస్తూ అడ్డుకోవాలని చూస్తోందని, కక్షతో అభివృద్ధిని అడ్డుకోలేరని చంద్రబాబు స్పషం చేశారు. 

Similar News