ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

Update: 2019-05-31 05:39 GMT

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు ఉండటంతో ఈ విషయాన్ని గుర్తించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. తాము కూడ ఆర్ అండ్ బీ అతిథిగృహంలో కూర్చొంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. దీంతో పరస్పర నినాదాలతో గొడవ చెలరేగింది. ఇక దీంతో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఉన్న టీఆర్ఎస్‌ నేతలను పోలీసులు బయటకు పంపారు. 

Full View

Similar News