ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పందిళ్లపల్లిలో పార్టీ ముఖ్య నేతలు, అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ మారే విషయంపై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం కార్యకర్తలతో భేటీ అనంతరం ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. రేపు వైసీపీ అధినేత జగన్తో ఆమంచి భేటీ అవుతారని తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆమంచి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని జిల్లాలో చర్చ నడిచింది. జనసేనవైపు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ను కూడా కలిశారని ప్రచారం జరిగింది. కాని ఆయన చూపు ఇప్పుడు వైసీపీ వైపు ఉందని చీరాలలో టాక్.