సీనియర్ ‌నేతలతో సమావేశమయిన చంద్రబాబు

Update: 2019-06-26 08:17 GMT

ప్రజావేదిక కూల్చివేత నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ప్రజా వేదిక పక్కనే ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూడా కూల్చివేస్తారంటూ వినిపిస్తున్న వార్తలపై నేతలు చర్చించారు. ప్రభుత్వం ఆ పని చేసేలోపే నివాసాన్ని ఖాళీ చేస్తే బాగుంటుందని పలువురు సీనియర్ నేతలు సూచించనట్టు సమాచారం. అయితే తొందరపడి ముందుగానే ఖాళీ చేస్తే అనవసర వివాదాలకు తావిచ్చినట్టు అవుతుందని మరికొందరు చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం వరకు వేచి చూసిన .. తరువాత తగిన నిర్ణయం తీసుకుందామని సీనియర్‌ నేతలు చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నోటీసులు ఇస్తే తక్షణమే సందిద్దామని కొందరు నేతలు చెప్పగా ... నోటీసులు ఇస్తారో లేదో ? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News