దేశభక్తి కంటే మోడీకి రాజకీయ భక్తి ఎక్కువ: సీఎం చంద్రబాబు

Update: 2019-03-02 04:56 GMT

ప్రధాని నరేంద్రమోడీపై ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన బీజేపీ నమ్మక ద్రోహంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయని చెప్పారు. దేశంలో ఏ ప్రధానికీ ఇంత నిరసనలు లేవని, మోడీ విఫల ప్రధానిగా మారారని ఆయన విమర్శించారు. మోడీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువన్నారు. ఓ వైపు పైలట్ అభినందన్ వస్తుంటే ప్రధాని ఢిల్లీలో ఉండకుండా విశాఖ వచ్చారని మండిపడ్డారు. ఆయన బోర్డర్‌లో ఉండి స్వాగతం కూడా పలకలేదని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ఇవ్వడమే పెద్ద త్యాగం అన్నట్టుగా మోడీ మాట్లాడుతున్నారని, డివిజన్లు లేని జోన్ ఎందుకని ప్రశ్నించారు చంద్రబాబు. 

Similar News