ఓటమి భయంతోనే వైసీపీ సైకో పార్టీగా వ్యవహరిస్తోంది : చంద్రబాబు

Update: 2019-03-26 06:03 GMT

25 ఎంపీ సీట్లు, 150కి పైగా అసెంబ్లీ సీట్లను గెలవడమే టీడీపీ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్-2019పై చంద్రబాబు, టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ సంక్షేమ పథకాలపై ప్రజల్లో అపూర్వ ఆదరణ ఉందన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ సైకో పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జగన్, కేసీఆర్ బంధాన్ని ఏపీ ప్రజలు ఎండగట్టాలన్నారు చంద్రబాబు. ఏపీలో కేసీఆర్ పెత్తనంపై ప్రజల్లో ఆవేశం, కోపాలున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్ కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. 

Similar News