ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు అందింది. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీలతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అమరావతి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు డీజీపీ ఠాకూర్. మధ్యాహ్నం ఒంటి గంటకు లేదా సాయంత్రం ఈసీ అధికారులను కలిసే అవకాశం ఉంది. ఓ వైపు ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో డీజీపీకి ఈసీ నుంచి పిలుపురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.