ప్రత్యేకత చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే

Update: 2019-06-04 12:31 GMT

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో దుండగులు ధ్వంసంచేసిన గాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేశారు. సిమెంట్‌తో విగ్రహానికి మరమ్మతులు చేపట్టిన ఆర్కే అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నమస్కారం చేశారు. గాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు. స్వతహాగా రైతు అయిన ఆర్కే నిరాడంబర జీవితం గడుపుతుంటారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేశ్‌పై ఆర్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News