ప్రకాశం జిల్లాలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం

Update: 2019-05-12 09:52 GMT

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. దారిన పోయేవాళ్లను వెంటపడి మరీ కరిచింది. ఈ ఘటనలో దాదాపు 10 మందికి తీవ్రగాయాలు కాగా, వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జిల్లాలోని తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ఓ కుక్క ఎక్కడి నుంచో ఊరిలోకి వచ్చింది. ఉదయాన్నే పొలంలోకి వెళుతున్న రైతులు, కూలీలను తరుముకుంది. దీంతో పలువురు భయంతో పరుగెత్తారు. 

Similar News