తన బాయ్ఫ్రెండ్ మీద ఉన్న కోపంతో ఓ యువతి ఏకంగా విమానం అద్దాన్ని పగలగొట్టింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చైనాలో గత నెలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్ఎస్ లీ అనే 29ఏళ్ల యువతి గత కొంతకాలంగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది. కొద్ది రోజులగా ఆమెను తన బాయ్ఫ్రెండ్ దూరం పెడుతుండటంతో తట్టుకోలేకపోయింది.
గత నెల 25న లూంగ్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తూ.. భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయి, విమానం కిటికీ అద్దాన్ని బద్దలు కొట్టింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన తోటి ప్రయాణికులు ఆ యువతిని నియంత్రించేందుకు ప్రయత్నించినా ఆమె వినలేదు. ఈ నేపథ్యంలో విమానాన్ని పైలట్ జెంగ్జోవ్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సిబ్బంది సమాచారంతో అప్పటికే అక్కడికి చేరుకున్నఎయిర్పోర్ట్ అధికారులు ఎంఎస్ లీని జెంజోహు పోలీసులకు అప్పగించారు. విమానం కిటికీ అద్దం పగలగొట్టిన సమయంలో ఆమె మద్యం సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సదరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.